సేంద్రియ వ్యవసాయం ద్వారా వచ్చిన పంట ఉత్పత్తులను వినియోగించడంవల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని నటుడు నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి అన్నారు . మాదాపూర్ ఇనార్బిట్ రోడ్డు లోని గఫూర్ నగర్ లో ఏర్పాటైన *ఫ్యూర్ ఓ న్యాచురల్* తెలుగు రాష్ట్రాల 40వ ఔట్లేట్ ను ఆమె శనివారం నాడు ప్రారంభించారు .
_ఈ సందర్భంగా నందమూరి వసుంధర దేవి మాట్లాడుతూ ఫలాలు పరిరక్షణకు సంజీవిని గా పని చేస్తాయని అన్నారు. శరీరం లో రోగనిరోధక శక్తిని పెంచే, పండ్లు, ఆకు కూరలు తీసుకోవటం ఈ రోజుల్లో ఎంతో అవసరం అని అన్నారు యాంత్రిక జీవనంలా మారిన ఈ రోజుల్లో పండ్లు ఫలాలు, ఆకుకూరలు తీసుకోవటం మరింత అలవర్చుకోవాలని, అప్పడే ఉల్లాసంగా ఉండకలుగుతతామని అన్నారు._
_ప్యుర్ ఓ న్యాచురల్ వ్యవస్థాపకులు మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆస్ట్రేలియా వాషింగ్టన్ థాయిలాండ్ యు.ఎస్ వంటి దేశాల నుండి దిగుమతి చేసిన విభిన్న ఫలాలు అందుబాటులో ఉంటాయని, 25 రకాల విదేశీ తో పాటు ఆంధ్ర తెలంగాణ రైతులు పండించిన ఆకుకూరలు లభిస్తాయని, ఈ నెలాఖరు కల్లా నగరం లో మారో మూడు ఔట్ లెట్ లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు._
0 Comments